Wednesday, September 10, 2025

కల్తీ పాలను తయరు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భూదాన్‌పోచంపల్లి: మండలంలోని భీమనపల్లి గ్రామంలో హైడ్రోజన్ పెరాక్సైడ్.. స్కిమ్డ్ మిల్క్‌ఫౌడర్ తో కల్తీ పాలను తయారు చేస్తున్న కందాల బుచ్చిరెడ్డి అనే వ్యక్తిని భువనగిరి ఎస్‌ఓటి పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అతని వద్ద 110 లీటర్ల కల్తీపాలు, 100 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 3కేజీల స్కిమ్డ్ మిల్క్ ఫౌడర్‌ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News