Thursday, September 18, 2025

రాజేంద్రనగర్‌లో గంజాయి పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం గంజాయి పట్టుబడింది. బండ్లగూడలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్ముతున్నట్లు పక్క సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలో ప్రతిరోజు ఎదో ప్రాంతంలో గంజాయి పట్టుబడుతున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News