Thursday, August 21, 2025

రైతులపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం :హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా నర్సింహులు పేట మండలంలో ఎరువుల కోసం లైన్‌లో నిలుచున్న రైతులపై లాఠీచార్జ్ చేసిన ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందేంటి ఈరోజు చేస్తున్నది ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సకాలంలో రైతులకు ఎరువులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టడమే కాక వారిని పోలీసులతో కొట్టించడం సిగ్గుచేటు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈరోజు రైతులు రోడ్డుపైకి వచ్చి రాత్రి పగలు లైన్లో వేచి ఉండాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. దీనికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పవలసింది పోయి రైతులపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం అన్నారు. ఎరువుల కోసం రైతులు ఇంకా ఎన్ని అవస్థలు పడాలి? ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా హోం మంత్రిగా ఉంటూ పోలీసులతో రైతులపై లాఠీచార్జ్ చేయించడం అమానుషం అన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News