Friday, June 13, 2025

రాష్ట్ర జాతిపితగా చెప్పుకొనే వ్యక్తే విచారణకు వచ్చారు: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ములుగులో మంత్రి పొంగులేని శ్రీనివాస్ (Ponguleti Srinivas) మీడియాతో చిట్‌చాట్ నిర్వహించరు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కామ్ అని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పేరుతో పింక్ వ్వస్థను బలోపేతం చేసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణంలో ఉన్న లోపాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు పేరుతో పింక్ కుట్రను చేధించేందుకే కమిషన్ ఏర్పాటు అయిందని అన్నారు.

అయితే కాళేశ్వరంపై కమిషన్ విచారణను తప్పుపడుతున్నారని తెలిపారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే పెద్దమనిషి విచారణకు హాజరయ్యారని.. కమిషన్ నివేదిక మేరకు ఎంత పెద్దవారైనా చట్టపరమైన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. కాళేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష, వేధింపులు ఉండవని తెలిపారు. మిషన్ భగీరథలో దోచుకున్నారు.. భూములు అమ్ముకున్నారు అని ఎద్దేవా చేశారు. ఒకదాని తర్వాత మరో అంశంపై విచారణలు ఉంటాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News