Sunday, June 29, 2025

వాళ్లు ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా బిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం పొన్నం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇలానే చేస్తే బిఆర్ఎస్ ను ప్రజలు కనుమరుగు చేయడం ఖాయమని హెచ్చరించారు. బిఆర్ఎస్, బిజెపిలు ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీలు పడుతున్నాయని పొన్నం చురకలంటించారు. ప్రభుత్వ ఉద్యోగులను బిఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టడం సరికాదని విమర్శించారు. గతంలో ఉద్యోగుల కోసం బిఆర్ఎస్ ఏమీ చేయలేదన్నారు.

మినిస్టర్ క్వార్టర్స్ లో గోపాల మిత్రలతో కలిసి పొన్నం ప్రభాకకర్, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని పొన్న ప్రభాకర్ కలిశారు. గోపాల మిత్రల సమస్యలను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రాష్ట్రంలో పశు పోషణ పశు సంపదకు గోపాల మిత్రలు కృషి చేస్తున్నారని వాకిటికి పొన్నం వివరించారు.  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి గోపాల మిత్రలు సమస్యలు పరిష్కారం చేస్తామన్న వాకిటి హామీ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News