తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న మాజీ ఐపిఎస్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గురువారం ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఆయనకు పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. పాస్ పోర్ట్ వచ్చిన మూడు రోజుల్లో ఇండియాకు రావాలని.. విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్రావును అరెస్ట్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం.. తదుపరి విచారణ ఆగస్ట్ 5వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుకు అక్కడి కోర్టుల షాకిచ్చింది. తనపై రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరుతూ ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. 3 రోజుల్లో ప్రభాకర్రావు భారత్ కు రావాలి: సుప్రీం
- Advertisement -
- Advertisement -
- Advertisement -