తెలంగాణ సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ప్రదాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. ఎట్టకేలకు అమెరికా నుంచి హైదారాబాద్ కు వస్తున్నాడు. రెండు రోజుల క్రితమే ప్రభాకర్ రావుకు ఇండియన్ ఎంబసీ ట్రావెల్ పర్మిట్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సిట్ ఎదుట విచారణకు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి కావడంతో ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయాడు. అప్పటినుంచి తిరిగి ఇండియాకు రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. కేంద్రం సహకారంతో ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చారు. ఎట్టకేలకు ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వస్తుండటంతో ఈ కేసులో ఎలా టర్న్ అవుతుదోనని ఆసక్తి నెలకొంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. అమెరికా నుంచి హైదరాబాద్ కు ప్రభాకర్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -