Saturday, June 28, 2025

అనుకున్నట్లు బౌలింగ్ చేయలేదు.. నెక్ట్స్‌టైమ్ అలా జరగదు: ప్రసిద్ధ్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఓటమికి బౌలింగ్ ఓ విధంగా కారణమని చెప్పుకోవాలి. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు బౌలర్లు నానాకష్టాలు పడ్డారు. మరోవైపు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ(Prasidh Krishna) బౌలింగ్‌లో తీవ్రంగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఏకంగా 220 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిను విమర్శలు ఎదురుకున్నాడు. తాజాగా ప్రసిద్ధ్ తన బౌలింగ్ గురించి మాట్లాడాడు. తాను అనుకున్నట్లుగా బౌలింగ్ చేయలేకపోయానని.. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని అతను పేర్కొన్నాడు.

‘‘మొదటి ఇన్నింగ్స్‌లో కోరుకున్న విధంగా బౌలింగ్ చేయలేకపోయా. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదించడంతో నా బౌలింగ్ మెరుగుపడింది. కానీ, నేను అనుకున్న విధంగా లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయా. పిచ్‌ను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. నా లోపాలను నేను అధిగమించగలను. ఈ విషయంలో పూర్తి బాధ్యత నాదే. నెక్ట్స్ టైమ్ బాగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రతి ఓవర్‌ను మొయిడెన్ చేయాలని అనుకుంటా. బౌండరీలు ఇవ్వద్దు అని ప్రయత్నిస్తా. కానీ ఔట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంది. నిజం చెప్పాలంటే నేను చాలాసార్లు లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేదు. దీంతో ఇంగ్లండ్ బౌలర్లు పరుగులు రాబట్టారు. కొన్ని సందర్భాల్లో బంతి ఎడ్జ్‌ తీసుకొని బౌండరీ వెళ్లింది. బౌన్సర్లు వేసే ప్రయత్నించా. కానీ, చివరకు పరుగులు సమర్పించుకున్న. నేను బౌలింగ్‌కు వచ్చిన ప్రతిసారి ఎకానమీ రేట్ తక్కవ ఉండేలా చూసుకుంటా. బ్యాటర్లపై ఒత్తిడి పెంచేలా బంతులు వేస్తా’’ అని ప్రసిద్ధ్ (Prasidh Krishna) పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News