Monday, June 16, 2025

డబ్లుటిసి 2025-27 షెడ్యూల్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

దుబాయ్: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 202325 ముగిసిన వెంటనే ఐసిసి తదుపరి షెడ్యూల్ విడుదల చేసింది. 2025-27 సైకిల్‌కు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం తొమ్మిది జట్లు కలిసి మొత్తం 71 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. 2025 జూన్ 17న శ్రీలంకలోని గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా సైకిల్ షురూ కానుంది. అయితే ఆస్ట్రేలియా (22 టెస్టులు) ఈసారి ఎక్కువ మ్యాచ్‌లు ఆడనుండగా.. ఇంగ్లండ్ 21 టెస్టుల్లో తలపడనుంది. ఈ ఏడాది చివరలో ఈ రెండు జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఆసీస్, ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మకమైన యాసెస్ సిరీస్ జరగనుంది. ఇక ఈ ఛాంపియన్ షిప్‌లో టీమిండియా మొత్తం 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.

వీటిలో ఎక్కువ భాగం హోమ్ మ్యాచ్‌లే ఉన్నాయి. ఇందులో భారత్.. ఇంగ్లండ్‌తో 5 టెస్టులు, వెస్టిండీస్‌తో 2 టెస్టులు, దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్‌తో 2 టెస్టుల్లో తలపడనుంది. డబ్లుటిసి గత సీజన్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న టీమిండియా ఈసారి ఎక్కువ మ్యాచ్‌లలో సొంతగడ్డపై ఉండటంతో భారత్‌కు కలిసొచ్చే అంశమనే (matter unity India)

చెప్పాలి. ఛాంపియన్ సౌతాఫ్రికా, అక్టోబరులో పాకిస్తాన్‌లో టెస్ట్ సిరీస్‌తో తన మ్యాచ్‌ను ఆరంభించనుంది. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఆసీస్ (22 టెస్టులు), ఇంగ్లాం డ్ (21 టెస్టులు) అత్యధిక మ్యాచ్లు ఆడతాయి. ఆ తర్వాత టీమిండియా 18 టెస్ట్‌లు, న్యూజిలాండ్ 16 టెస్టులు, వెస్టిండీస్ 14 టెస్టులు, దక్షిణాఫ్రికా 14 టెస్టులు, పాకిస్థాన్ 13 టెస్టులు, శ్రీలంక 12 టెస్టులు, బంగ్లాదేశ్ 12 టెస్టులు ఆడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News