Sunday, June 29, 2025

ఆదిలాబాద్‌లో ప్రైవేటు బస్సు బోల్తా: 25 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ శివారులో జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఒకరిపరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్షతగాత్రులు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News