పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎ దురుచూస్తున్న చిత్రం ఓజీ. డీవీవీ ఎం టర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దాన య్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్ గంభీర గా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రి యాంక అరుళ్ మోహన్ కథానాయిక గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్ర పంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుద ల కానున్న ’ఓజీ’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఈ నేపథ్యం లో కథానాయిక ప్రియాంక అరుళ్ మో హన్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. “ఓజీతో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పవన్ కళ్యాణ్తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓజీ సినిమాలో కణ్మని పాత్ర చేయడం మరింత అ దృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసు లో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. పవన్ కళ్యాణ్ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఆన్ స్క్రీన్లో మరియు ఆఫ్ స్క్రీన్లో ఆయన రియల్ హీరో. ఇక డైరెక్టర్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. వెంటనే ఈ సి నిమా చేయడానికి అంగీకరించాను. ఇది 1980, -90లలో జరిగే కథ. పా త్రను మలిచిన తీరు కానీ, ఆహార్యం కానీ అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. సినిమాలో నేను చేసిన కణ్మని ఒక అ మాయక స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కణ్మ ని. తమన్ స్వరపరిచిన ‘సువ్వి సువ్వి’ పాట అందరికీ నచ్చడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ ఫ్యామిలీ డ్రామా ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో యాక్షన్ అనేది ఒక భాగం మాత్రమే. బలమైన క థ ఉంది. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. సినిమాలోని సీన్ ఎలా తీయాలి, నటుల నుంచి ఎలాంటి న టన రాబట్టుకోవాలి.. ఇలా ప్రతి విషయంపై సుజీత్కు స్పష్ట త ఉంది. నా క్యారెక్టర్, లుక్ బాగున్నాయంటే దా నికి కార ణం ఆయనే. డీవీవీ బ్యానర్లో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా రు. నిజానికి నేను మొదట ఓజీ సినిమానే అంగీకరించాను. కానీ సరిపోదా శనివారం చిత్రం ముందు విడుదలైంది. నిర్మాతలు దానయ్య, కళ్యాణ్ చాలా మంచి మనుషులు” అని అన్నారు.