Friday, June 13, 2025

సినీ నిర్మాత కావూరి ఇకలేరు

- Advertisement -
అమరావతి: సీనియర్ సినీ నిర్మాత కావూరి మహేంద్ర(79) కన్నుమూశారు. గత అర్ధరాత్రి గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కావూరి తుదిశ్వాస విడిచారు. చెన్నైలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో 50కి పైగా సినిమాలు నిర్మించారు. గీతా ఆర్ట్స్ పిక్చర్స్, ఎ.ఎ ఆర్ట్స్ బ్యానర్ పైనా ఆయన చిత్రనిర్మాణం చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ వచ్చాక ఎ.ఎ.ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీహరిని హీరోగా పరిచయం చేశారు. ఆయన నటుడు, నిర్మాత డాక్టర్ మాదాల రవికి మామగారు. దర్శకుడు గోపీచంద్ మలినేనిని దర్శకత్వ శాఖలో పరిచయం చేసింది ఆయనే. గుంటూరులోని మహాప్రస్థానంలో గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి. 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News