Saturday, August 2, 2025

రేపటి నుంచి టీచర్ల పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన షె డ్యూల్ వెలువడింది. శనివారం(ఆగస్టు 2) నుం చి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారం భం కానుంది. ఆగస్టు 11 వరకు దీనిని పూర్తి చే యాలని నిర్ణయించింది. మొత్తం 10 రోజుల్లో టీ చర్ల ప్రమోషన్ల పూర్తి కానున్నాయి. ఈ నెల 2వ తేదీన గ్రేడ్ 2 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు పోస్టుల ఖాళీల వివరాలు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల సీజియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. 3వ తేదీన సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి 4,5 తేదీలలో తుది సీనియారిటీ జాబితాను ఖరారు చేస్తారు. ఈ నెల 6వ తేదీన గ్రేడ్ 2 గెజిటెడ్ హెడ్ మాస్టర్ల పదోన్నతులకు స్కూల్ అసిస్టెంట్లు వెబ్ ఆప్షన్ల నమోదు కు అవకాశం కల్పించారు. అదేరోజున వెబ్ ఆప్షన్లలో సవరణకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 7 వ తేదీన పదోన్నతులు పొందిన గ్రేడ్ 2 గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు ఉత్తర్వులు అందజేస్తారు. అనంతరం ఈ నెల 8,9 తేదీలలో స్కూల్ అసిస్టెంట్ ఖాళీ పోస్టుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి, ఎస్‌జిటి తరువాయి 8లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News