Friday, June 6, 2025

దుండిగల్ లో క్రికెట్ మైదానంలో వ్యభిచారం గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

క్రికెట్ స్టేడియం మైదానంలో వ్యభిచారం చేపడుతున్న ఓ ముఠాను మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల దాడుల్లో ఇద్దరు సెక్స్ వర్కర్ల తో పాటు ఇద్దరు విటులను ఒక ఆర్గనైజర్ను మేడ్చల్ ఎస్ ఓ టి పోలీసులు అదుపులోకి తీసుకొని దుండిగల్ పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులకు పట్టుబడ్డ వారిలో అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే పెట్రోల్ మొబైల్ డ్రైవర్ సొంత సోదరుడు ఉండగా, మరో వ్యక్తి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి కుమారుడు తోపాటు ఆర్గనైజర్ దుండిగల్ తాండాలో ఓ దేవాలయ పూజారి కుమారుడు ఉన్నట్లు సమాచారం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి దుండిగల్ తండాకు చెందిన ఆర్గనైజర్ శివ నాయక్(31) తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచనతో ఈజీ మనీ కోసం వ్యభిచారాన్ని ఎంచుకున్నాడు.

తెలిసిన ద్వారా నో లేక ఆన్లైన్ ద్వారానో ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేస్తున్నాడు. ఇతర హలో వారం రాత్రి ఆన్లైన్లో సెక్స్ వర్కర్లకు డబ్బులు చెల్లించి బుక్ చేసిన శివ నాయక్, గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన ఇద్దరు విటులు మనోజ్, వంశీలకు సెక్స్ వర్కర్లను అప్పగించారు. వీరు రండి మైసమ్మలోని క్రికెట్ మైదానంలో వ్యభిచారం చేస్తుండగా మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 6 కండోమ్ ప్యాకెట్లతోపాటు, 6 సెల్ ఫోన్లు 500 రూపాయల నగదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వివరాలను సేకరించారు. వీరిని దుండిగల్ పోలీస్ స్టేషన్కు అప్పగించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఓటి పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వీటిలో ఒకరు ఫారెస్ట్ అధికారి కుమారుడు ఉండగా, మరొకరు కానిస్టేబుల్ సోదరులు ఉండడం కోసం మెరుపు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News