Thursday, June 5, 2025

పాక్ గూఢచారిని అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ, ప్రముఖ ఖలీస్థానీ ఉగ్రవాది కోసం పనిచేస్తున్న గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గగన్‌దీప్ సింగ్ ఆపరేషన్ సిందూర్ సహా గత కొన్ని ఏళ్లుగా సరిహద్దులో సైనిక కదలికలకు సంబంధించిన కీలక సమాచారం అందించాడని ఆరోపణ. వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించిన సైనిక దళాల సమాచారాన్ని కూడా అందించాడని సమాచారం. జాతి భద్రతకు సంబంధించి హానీ చేసే సమాచారాన్ని అతడు షేర్ చేశాడని అధికారులు తెలిపారు. ఈ వివరాలను పంజాబ్ పోలీస్ చీఫ్ గోపాల్ సింగ్ చావ్లా మంగళవారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News