- Advertisement -
న్యూఢిల్లీ: రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్ నిబంధనలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. తత్కాల్ టికెట్ల బుకింగ్పై ఆధార్ తప్పని సరి చేసిన రైల్వేశాఖ.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురావాలని అన్ని రైల్వే జోన్ల చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ అర్థరాత్రి 12 గంటల నుంచి పెంచిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500 కి.మీ వరకు సాధారణ ఛారీలే ఉండనున్నాయి. 501 కి.మీ నుంచి 1500 కి.మీ వరకు టికెట్పై రూ.5, 1501 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్పై రూ.10; 2501 నుంచి 3వేల కి.మీ వరకు టికెట్పై రూ.15 చొప్పున పెంచారు.
- Advertisement -