- Advertisement -
దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
- Advertisement -