- Advertisement -
హైదరాబాద్: గోశాలల నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో సిఎంకు రాజాసింగ్ అభినందనలు తెలిపారు. గోశాలల నిర్మాణం, గోవుల పరిరక్షణ కమిటీలో తనకు సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ కోరారు. గోవుల పరిరక్షణకు ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గోవధను నిషేధించాలని రాజాసింగ్ వినతి పత్రం అందజేశారు.
వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వ విద్యాలయం సమీపంలో విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని సిఎం సూచించారు.
- Advertisement -