Wednesday, June 18, 2025

కిషన్‌రెడ్డీ జీ..నాకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వండి: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

ఏదో ఒక వివాదాస్పద ప్రకటన చేస్తూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆకస్మికంగా చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా సమావేశమయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాలని, కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు రాజాసింగ్ మంగళవారం తెలిపారు. వ్యక్తిగతంగా కలిసేందుకు సమయం ఇవ్వాలని రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎక్కడ, ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియజేస్తే, తానే అక్కడికే వచ్చి కలుస్తానని, అందుకు తనకు సమయం కేటాయించాలని కోరారు.

ఈ సందర్భంగా రాజాసింగ్ సానుకూల ధృక్పధంతో మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి బీజేపీ అవసరమని అన్నారు. ఈ సమయంలో వ్యక్తిగత విషయాలు పక్కన బెట్టి పార్టీలో అంతా ఐక్యంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గత కొన్ని నెలలుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితరులపై పరోక్షంగా విమర్శలు గుప్పించి ఒక్కసారిగా కిషన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఎవరూ ఊహించని రీతిలో కోరడం ప్రస్తుతం ఆ పార్టీ నాయకుల్లో చర్చ సాగుతోంది. అయితే ఇలా మీడియా ద్వారా కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేయడంపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News