మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన ముందుండే నాయకుడు రాజగోపాల్ రెడ్డి అన్నారు. పేద ప్రజల గుండెల్లో నిలిచే ప్రజా నాయకుడు రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రజల మధ్యలో జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ చైర్మన్ వల్లంబట్ల పూర్ణచందర్ రావు, జిల్లా కాంగ్రేస్ ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, యాదగిరిగుట్ట బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జినుకల కనకయ్య, కాంగ్రెస్ నాయకులు కారుపోతుల వెంకన్న గౌడ్, అంతటి నర్సయ్య, తండా సత్తయ్య, తీగల నరసింహారెడ్డి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ముద్దం జయశ్రీ, పట్టణ ఉపాధ్యక్షురాలు కురిమిళ్ళ ప్రమీల, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు మెంట నగేష్, NSUI మండల అధ్యక్షుడు నిమ్మల శ్రీనువాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరిసానిపల్లి సందీప్, మండల యూత్ కాంగ్రేస్ ఉపాధ్యక్షులు అవిశెట్టి కిరణ్, ఓబీసీ విభాగం మండల ఉపాధ్యక్షుడు కస్తూరి వీరస్వామి, మండల కాంగ్రెస్ కార్యదర్శి బత్తిని శేఖర్, నాయకులు మహ్మద్ అలీ, కురిమిళ్ళ రాములు, పల్లె బిక్షం, దేవరపల్లి రంగారెడ్డి, కేమెడీ సైదులు, ఆలకుంట్ల శ్రీనివాస్, కందుకూరి మురళి, గడ్డం రమేష్, నల్ల రామ నరసయ్య, లింగయ్య, కూరెళ్ళ, నవీన్ కూరెల్ల నరసయ్య, మునీర్, జానీ పాషా, రాజు, కర్ణ, వంగరి రాములు, తదితరులు పాల్గొన్నారు.