రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో కోవిడ్ కేసుల కలకలం పలువురిని ఆందోళన గురిచేస్తుంది. గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో గత కొన్ని రోజులుగా జ్వరం, నాలుక రుచి,ముక్కు వాసన కోల్పోవడంతో సిరిసిల్ల జిల్లా ప్రధాన వైద్యశాలలో కోవిడ్ పరీక్షల కోసం వెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించడం లేదని ఆసుపత్రి బాధ్యులు చెప్పడంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్గా నిర్ద్ధారణ కావడంతో కుటుంబీకులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటనపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ ఆఫీజాను వివరణ కోరగా రాపిడ్ టెస్టుల్లో పాజిటివ్గా వచ్చిందని కోవిడ్ నిర్ద్ధారణ కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపించామని ప్రస్తుతం ఆ కుటుంబాన్ని క్వారంటైన్లో ఉంచామని తెలిపారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.
తంగళ్ళపల్లిలో కోవిడ్ కలకలం
- Advertisement -
- Advertisement -
- Advertisement -