Saturday, May 31, 2025

మద్యం మత్తులో అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని హత్య

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు స్నేహితులు మద్యం తాగి గొడవ పడడంతో ఒకరు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  వరంగల్ జిల్లాకు చెందిన సాయి కార్తీక్, పులివెందులకు చెందిన సిద్ధార్థ్ రెడ్డి, మరొక స్నేహితుడితో కలిసి రాజేంద్రనగర్ లో ఉంటున్నారు. ముగ్గురు కలిసి మద్యం తాగుతుండగా డబ్బుల విషయంలో గొడవ జరిగింది.

సిద్దార్థ్ రెడ్డి తాను ఇచ్చిన అప్పు డబ్బులు ఎనిమిది లక్షలు ఇవ్వాలని సాయి కార్తీక్ ను కోరాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుడడంతో ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఒక్కసారిగా సాయి కార్తీక్ పై సిద్ధార్థ్ రెడ్డి దాడి చేసి హతమార్చాడు. అనంతరం ఘటనా స్థలంలో నుంచి నిందితుడు పారిపోయినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News