- Advertisement -
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సందర్భంగా ఎంఎల్ఎ రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దంపతుల కాల్స్ విని ఎంజాయ్ చేయడం మంచి పద్దతి కాదని హితువు పలికారు. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, హెబ్బా పటేల్ ఫోన్లు ట్యాప్ చేశారని, వాళ్లు ఏమైనా మహిళా మావోయిస్టులా అని చురకలంటించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లను తిట్టాలంటే ప్రజాస్వామ్య భాష సరిపోవడం లేదని రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. సిఎం రేవత్ రెడ్డి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, తెలంగాణ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాప్ చేసి ఆడియోలు, వీడియోలు వింటూ ఎంజాయ్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం, లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడం ఏంటని రాకేశ్ రెడ్డి అడిగారు.
- Advertisement -