ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. దీంతో దర్శకులు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు తెరకెక్కించేందుకు ఇష్టపడుతున్నారు. అలా తెరకెక్కుతున్న ఓ పాన్ ఇండియా సినిమానే ‘రామాయణ్’. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సౌత్ ముద్దుగుమ్మ సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తుంది. కన్నడ రాక్స్టార్ యశ్ రావణాసురుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో రావణాసురిడి సోదరి శూర్పణక పాత్ర కోసం ప్రియాంక చోప్రాని తీసుకున్నారట. కానీ, ఆమె చేతినిండ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసి టాక్. అయితే ప్రియాంక స్థానంలో ఆ పాత్రకి రకుల్ ప్రీత్ సింగ్ను సంప్రదించారని.. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడమే సంతోషంగా భావించిన రకుల్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పాత్ర కోసం రకుల్ లుక్ టెస్ట్ కూడా జరిగిందట. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉన్నదో అనే విషయం తేలాల్సి ఉంది. ఇక రామాయణ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం 2027లో విడుదల కానుంది.