డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించడం గొప్ప విషయమని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం 2025 సందర్భంగా గురువారం నగరంలోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, దిల్ రాజు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలకు చాక్లెట్లు, ఐస్క్రీమ్లు కొనివ్వాలంటే భయపడే పరిస్థితి ఉందని అన్నారు. ఒక తండ్రిగా రాష్ట్రం గురించి, సిటీ గురించి, స్కూల్స్ గురించి ఆలోచించాల్సి వస్తుందని.. రేపు మా పిల్లలను బయటకు పంపించాలంటే ఇవన్నీ ఆలోచించాల్సి ఉంటదని చెప్పారు. వ్యవస్థలోని చెత్తను శుభ్రం చేసేందుకు ప్రభుత్వానికి అందరూ సహకరించాలని రామ్ చరణ్ అన్నారు. ఇక విజయ మాట్లాడుతూ..డ్రగ్స్ విషయంలో యువత చాలా కేర్ఫుల్గా ఉండాలన్నారు. హెల్త్, మనీ, సక్సెస్, రెస్పెక్ట్ ఇవి మనిషికి చాలా ముఖ్యమని.. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనిషికి ఇవన్నీ దూరమవుతాయని చెప్పారు.