- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో బిజెపి కొత్త అధ్యక్షుల పేర్లు ఖరారయ్యాయి. పార్టీలో ఎక్కువకాలం ఉన్నవారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బిజెపి కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. నామినేషన్ వేయాలని అధిష్ఠానం ఆయనను ఆదేశించినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఆంధ్రప్రదేశ్ బిజెపికి కొత్త అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ ను ఎంపిక చేసింది. ఆయన కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎపి మండలిలో బిజెపి ఫ్లోర్ లీడర్గా మాధవ్ వ్యవహరించారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎపిలో ఎంపి పురందేశ్వరీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.
- Advertisement -