Saturday, June 28, 2025

గోండు తెగల ప్రపంచం ఆధారంగా ‘మైసా’

- Advertisement -
- Advertisement -

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త మూవీని యాక్షన్- ప్యాక్డ్ పోస్టర్‌తో ప్రకటించారు. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో హై బడ్జెట్‌తో నిర్మించనున్నారు. దర్శకుడు హను రాఘవపూడి తెలుగు లుక్, పోస్టర్‌ను లాంచ్ చేశారు. ‘కుబేర’ కో యాక్టర్ ధనుష్ తమిళ్ పోస్టర్, ‘చావా’ కో యాక్టర్ విక్కీ కౌశల్ హిందీ పోస్టర్‌ను విడుదల చేశారు.

దుల్కర్ సల్మాన్ మలయాళ పోస్టర్‌ను, శివరాజ్ కుమార్ కన్నడ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అందరూ రష్మిక, మైసా టీంకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక పోస్టర్‌లో సాంప్రదాయ చీరలో, ముక్కుపుడక, ఆభరణాలతో రష్మిక ఒక గోండు మహిళగా కనిపించి సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. ఈ సినిమా గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన అద్భుతమైన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని దర్శకుడు రవీంద్ర పుల్లె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News