దిండిగల్ (తమిళనాడు): కోయంబత్తూరులో తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్కు భారీ జరిమానా విధించారు. ఆదివారం దిండిగల్ డ్రాగన్స్-తిరుప్పూర్ తమిజాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దురుసుగా ప్రవర్తించిన అశ్విన్కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు. అశ్విన్ (Ashwin) దిండిగల్ డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. తిరుప్పుర్తో జరిగిన ఈ మ్యాచ్లో అశ్విన్ ఓపెనర్గా దిగాడు. సాయి కిషోర్ ఓవర్లో అశ్విన్ స్విప్ షాట్ ఆడబోయి బంతిని మిస్ చేశాడు. దీంతో బంతి ప్యాడ్స్కి తగిలింది. వెంటనే బౌలింగ్ టీం అప్పీల్ చేయగా.. అంపైర్ దాన్ని ఔట్గా ప్రకటించారు. దాంతో అశ్విన్ ఆగ్రహంతో మహిళ అంపైర్తో (Female Umpire) వాగ్వాదానికి దిగారు. అంపైర్ పట్టించుకోకపోవడంతో అశ్విన్ అసహనంతో బ్యాట్ను ప్యాడ్స్కి కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ కూడా అశ్విన్ పై ఫైర్ అవుతున్నారు.
అంపైర్ తో దురుసు ప్రవర్తన.. అశ్విన్ కు భారీ జరిమానా
- Advertisement -
- Advertisement -
- Advertisement -