Monday, September 15, 2025

టెన్త్ లో 554 మార్కులు… ప్రేమోన్మాది వేధింపులకు బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం మిట్టమీదిపల్లెలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమోన్మాది వేధింపులకు గురి చేయడంతో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక పుట్టినరోజునే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సదరు బాలిక ఇటీవల పదో తరగతిలో ఎగ్జామ్స్ లో 554 మార్కులు వచ్చాయి. డాక్టర్ కావాలని ఆకాంక్షతో బాలిక బైపీసీ తీసుకుంది. తారకరత్నం అనే యువకుడు ప్రేమ పేరుతో బాలికను వేధించాడు.   ఇంట్లో చెబితే బాలిక తండ్రిని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. తండ్రికి చెప్పడంతో సోషల్ మీడియాలో ఫొటోస్ పెడతానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడి ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News