- Advertisement -
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆర్సిబి.. రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించింది. కాగా, 18ఏళ్ల తర్వాత తొలిసారి ఆర్సీబి జట్టు కప్ గెలిచిన సందర్భంగా బెంగళూరులో నిన్న విక్టరీ పరేడ్ నిర్వహించారు. అయితే, అభిమానులు భారీగా తరలిరావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మరణించినవారిలో ఓ పాపతోపాటు మహిళ కూడా ఉంది. దీంతో ఆర్సీబి విజయోత్సవం తీవ్ర విషాదాన్ని నింపింది.
- Advertisement -