లక్నో: పెళ్లి చేసుకుంటానని ఆర్సిబి బౌలర్ యశ్దయాల్ తనని మోసం చేశాడని ఓ యువతి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. యశ్దయాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని యుపి సిఎం ఆన్లైన్ పోర్టర్లో ఫిర్యాదు చేసింది. గత ఐదు సంవత్సరాల నుంచి అతడు, తాను ప్రేమించుకుంటున్నామని, కాబోయే కోడలు అంటూ ఇంట్లోవాళ్లకు కూడా ఆమె పరిచయం చేశారన్నారు. యశ్దాయల్తో దిగిన ఫొటోలు, వీడియోలు, వీడియో కాల్స్, చాటింగ్ స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఆధారాలు పంపించింది. ఇతర అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని తనని గత కొన్ని రోజుల నుంచి శారీరకంగా, మానసికంగా తనను హింసకు గురి చేశాడని ఫిర్యాదులో ఆరోపణలు చేసింది. జూన్ 14న మహిళల హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేశానని, పోలీసులు పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు న్యాయం జరగాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించానని వివరణ ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఘజియాబాద్ సర్కిల్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరింది.
పెళ్లి చేసుకుంటానని ఆర్సిబి బౌలర్ మోసం… యువతి ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -