Friday, June 6, 2025

బెంగళూరు చేరుకున్న ఆర్సీబి.. సాయంత్రం విక్టరీ పరేడ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తొలిసారి ఐపిఎల్ 2025 విజేతగా నిలిచిన సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు జట్టు విజయోత్సవ పరేడ్ నిర్వహించనున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వెల్లడించింది. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌లో ఐపిఎల్ ఫైనల్ లో పంజాబ్ పై గెలిచిన తర్వాత ఆర్సీబి జట్టు ఈరోజు మధ్యాహ్నం బెంగళూరులోని ఓల్డ్ HAL విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఘన స్వాగతం పలికారు.

“ఈరోజు సాయంత్రం 5 గంటలకు విక్టరీ పరేడ్ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు జరుగుతాయి. అభిమానులు అందరూ పోలీసులు, ఇతర అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని మేము అభ్యర్థిస్తున్నాం, తద్వారా అందరూ రోడ్‌షోను శాంతియుతంగా ఆస్వాదించవచ్చు. shop.royalchallengers.comలో ఉచిత పాస్‌లు (పరిమిత ప్రవేశం) అందుబాటులో ఉన్నాయి” అని RCB Instagramలో ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

RCB జట్టు సాయంత్రం 4 గంటలకు విధాన్ సౌధకు చేరుకుంటుంది. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన్ సౌధలో RCB జట్టును సత్కరిస్తారని తెలుస్తోంది. తరువాత సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ ప్రారంభమవుతుంది. కాగా, ముందుగా, నగరంలో ట్రాఫిక్ రద్దీ భయాల కారణంగా బెంగళూరు పోలీసులు ఓపెన్ బస్సు పరేడ్‌ను తిరస్కరించారు. అయితే, ముందుగా అనుకున్న విధంగానే విజయోత్సవ పరేడ్ జరుగుతుందని RCB ఇప్పుడు ధృవీకరించింది. కానీ ఓపెన్ బస్సు పరేడ్ జరిగే అవకాశం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News