Sunday, June 15, 2025

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: రైతుల భూసంబందిత సమస్యల పరిష్కారం చేయడానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని డిప్యూటీ తహశీల్దార్ ఎం.ఉపేందర్ అన్నారు. మోత్కూరు మండలంలోని దాచారం గ్రామంలో మంగళవారం రెవెన్యూ శాఖ ఆద్వర్యంలో భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ మాట్లాడుతూ రైతులు వారి భూ సమస్యలపై అధికారులకు ఆర్జీలు అందిస్తే వాటిని పరిష్కరిస్తామని అన్నారు. అక్కడికక్కడ పరిష్కారమయ్యే సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరిస్తారని అన్నారు. మండలస్థాయిలో తహశీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ లు పరిష్కరించేలా భూ భారతి చట్టం ప్రభుత్వం రూపొందించారని తెలిపారు. రైతులు తమ భూరికార్డులలో తప్పులను సరిచేసుకోవచ్చునన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు డి.శ్రీనివాస్, జె.సుమన్, సర్వేయర్ పరీదుద్దీన్, సీనియర్ అసిస్టెంట్‌లు, జూనియర్ అసిస్టెంట్‌లు, రికార్డు అసిస్టెంట్‌లు, రెవెన్యూ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News