- Advertisement -
మహబూబ్నగర్లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జియుకెటి) కొత్త క్యాంపస్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్యాంపస్లో 2025 -26 విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. మహబూబ్నగర్ క్యాంపస్లో ఈ ఏడాది నుంచి మూడు కోర్సులు..కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్ఇ(ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్), సిఎస్ఇ డాటా సైన్స్) ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వుల్లో వెల్లడించారు.
- Advertisement -