Sunday, June 8, 2025

ఎంపి ప్రియాతో రింకు సింగ్ నిశ్చితార్థం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎంపి, న్యాయవాది ప్రియా సరోజ్ తో భారత క్రికెటర్ రింకు సింగ్ నిశ్చితార్థం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. ఈ జంట సాంప్రదాయ దుస్తులలో కెమెరాలకు పోజులిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వేడుకకు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, జయ బచ్చన్, శివపాల్ యాదవ్, ప్రవీణ్ కుమార్ వంటి సీనియర్ సమాజ్ వాదీ పార్టీ నాయకులు, పలువురు క్రికెటర్లు అతిథులుగా హాజరయ్యారు. నిశ్చితార్థ వేడుకకు ముందు, రింకు సింగ్ తన కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని చౌదేరా వాలి విచిత్రా దేవి ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా, నవంబర్ లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News