Monday, June 23, 2025

రెడ్ బుక్ రాజ్యాంగం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కు వస్తున్న ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని  మాజీ మంత్రి ఆర్ కె రోజా మండిపడ్డారు. సింగయ్య చనిపోవడంతో కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే కుట్రలు, తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.  ఆమె మీడియాతో మాట్లాడుతూ..18న జగన్ కాన్వాయ్ ముందు చనిపోయారంటూ ఎస్పి చెప్పారని, 22న అదే ఎస్పి చేత అబద్ధం చెప్పించారని చెప్పారు. నిజమైతే డ్రైవర్ పై కేసు (Case driver)  పెట్టాలి కానీ జగన్ పై పెట్టడమేంటీ అని అన్నారు. విమానం కూలిన ఘటనపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ పై ఎందుకు కేసు పెట్టలేదు? అని ప్రశ్నించారు. సింహాచలం గోడ కూలిన ఘటనపై హోం మంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు? అని అన్నారు. బైక్ స్టంట్ లు చేయాలన్న పవన్ మాటలు విని ఇద్దరు చనిపోయారని, మరి పవన్ కల్యాణ్ పై ఎందుకు కేసులు పెట్టలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని రోజా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News