Tuesday, September 16, 2025

ఇసుక లారీ బీభత్సం

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇసుక లారీ సోమవారం బీభత్సం సృష్టించింది. కాళేశ్వరం నుండి వస్తున్న ఇసుక లారీ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్దకు రాగానే పక్కనే ఉన్న బైక్ ల మీదికి దూసుకెళ్లింది. దీంతో ఒక యువకుడు లారీ మధ్యలో ఇరుక్కున్నాడు. దీంతో ఇటు పోలీసులు, స్థానిక యువత, సింగరేణి రెస్క్యూ, టిమ్ గంటన్నర సేపు శ్రమించారు. చివరికి క్రేన్ సహాయంతో ఇసుక లారీని పైకి లేపడంతో ఇరుక్కున్న యువకుడిని బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్ లో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News