- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం కురబలకోట మండలంలోని చెన్నమర్రి మిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న టెంపో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలకు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -