- Advertisement -
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సిటీలోని గచ్చిబౌలిలో ఓ టిప్పర్ అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న యువకుడు మరణించగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ
ప్రమాదంలో మృతి చెందిన యువకుడిని దుర్గ కిరణ్ (25)గా పోలీసులు గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -