Tuesday, June 17, 2025

రాజన్న ఆలయ, పట్టణ అభివృద్ధికి రూ. 100 కోట్లు

- Advertisement -
- Advertisement -

వేములవాడ రాజన్న సన్నిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, పట్టణంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎల్పీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 80 ఫీట్‌ల రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయని, నవంబర్ 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 8 మంది మంత్రుల సమక్షంలో రూ.76 కోట్లతో ఆలయ విస్తరణ, రూ.47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు, రూ.35 కోట్లతో అన్న సత్ర నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినట్టు ఆయన తెలిపారు. 2024, -25 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు, 25-,26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో రూ. 100 కోట్లు రాజన్న ఆలయ, పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు.

ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధిని సమాంతరంగా చేస్తున్నామని పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని చేస్తామని ఆయన తెలిపారు. 30 సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్న రోడ్డు వెడల్పు, ఆలయ అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా కేవలం శంకుస్థాపనలకు పరిమితం కాకుండా పనులు ప్రారంభించుకుంటున్నామని ఆయన తెలిపారు. వేములవాడ ఆలయాన్ని 4 ఎకరాల్లో విస్తరణ చేయడం కోసం శృంగేరి పీఠానికి వెళ్లి వారి సూచనలు, సలహాలు తీసుకొని ఆలయ అభివృద్ధిపై ముందుకు పోతున్నామన్నారు. భవిష్యత్‌లో రాజన్న ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు వెచ్చిస్తామని, మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రాజన్న భక్తులకు మెరుగైన వసతులు, శీఘ్రదర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News