- Advertisement -
అనంత పురం జిల్లా: బెలుగుప్ప- నక్కపల్లి మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టిసి బస్సు బోల్తాపడి 10 మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆర్టిసి బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయదుర్గం నుంచి బెలుగుప్ప మీదుగా అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య
- Advertisement -