- Advertisement -
కామేపల్లి: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మర్రిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టిసి బస్సు-రెడీమిక్స్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. ఇరువురు డ్రైవర్లకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. రెండు వాహనాలు రోడ్డు ఇరువైపులా ఉండడంతో తీవ్ర ట్రాఫిక జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -