శంషాబాద్ విమానాశ్రయం వద్ద కొత్త బోర్డింగ్
పాయింట్ ఏర్పాటు చేసిన ఆర్టిసి
మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే వారికి తెలంగాణ ఆర్టిసి శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఆర్జిఐఎ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్) క్రాస్ రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్ను ఆర్టిసి ఏర్పాటు చేసింది. ఎయి ర్పోర్ట్ నుంచి పుష్పక్ బస్సుల్లో సమీపంలో ఉన్న ఆర్జిఐఎ బోర్డింగ్ పాయింట్కి భక్తులు ప్రయాణించి, అక్కడి నుంచి ఆర్టిసి బస్సుల్లో శ్రీశైలానికి వెళ్లవచ్చు.
ఈ బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రతి 20నిమిషాలకు ఒక బస్సు శ్రీశైలానికి అందుబాటులో ఉంటుంది. ఎయిర్ పోర్టు నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు http://tgsrtcbus.in వెబ్సైట్లోనూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ సమయంలో వారు ఆర్జిఐఎ క్రాస్ రోడ్ బోర్డింగ్ పాయింట్ను ఎంచుకోవాలి. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టిసి కోరుతోంది. ఈ వివరాలను సోమవారం ఎక్స్ వేదికగా ఆర్టిసి ఎండి సజ్జనార్ వెల్లడించారు.