Saturday, May 31, 2025

రేవంత్ రెడ్డితో నలుగురు సమాచార ఆర్టీఐ కమిషనర్ల భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నలుగురు సమాచార ఆర్టీఐ కమిషనర్లు (RTI Commissioners) భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో సిఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy) వారు కుటుంబ సమేతంగా కలిశారు. నూతన సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, మొహిసినా పర్వీన్‌లు సిఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎంకు శాలువలు కప్పి వారు పుష్పగుచ్చం అందజేశారు.

కాగా, గత కొన్నేళ్లుగా ఆర్టీఐ కమిషనర్ పదవులు ఖాళీగా ఉండటంతో, పౌరులకు సమయానికి సమాచారం లభించడంలో జాప్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా నియామకాలు చేపట్టడంతో పౌర హక్కుల పరిరక్షణలో కీలక ముందడుగు పడింది. ప్రస్తుతం నియమితులైన కమిషనర్లు వేర్వేరు రంగాల్లో అనుభవం కలిగి ఉన్నవారు. వారి అనుభవం సమాచార హక్కు అమలులో నాణ్యతను మెరుగు పరచడానికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News