Wednesday, September 10, 2025

ఉక్రెయిన్‌లో పెన్షనర్లపై రష్యా బాంబు దాడి.. 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

తూర్పు ఉక్రెయిన్‌లో మంగళవారం ఒక గ్రామంపై రష్యా గ్లైడ్ బాంబు దాడికి 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. డొనెట్‌స్క్ రీజియన్ లోని యరోవా గ్రామంలో పెన్షన్ల కోసం బారులు తీరిన వృద్ధులపై ఈ బాంబు దాడి జరగడం శోచనీయం. ఈ దాడి అత్యంత పాశవికమని , రష్యా తన దురాక్రమణకు తగిన మూల్యం చెల్లించుకునేలా అదనపు ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్థించారు. ప్రపంచం మౌనంగా, అచేతనంగా ఉండరాదని ఆయన అన్నారు. అమెరికా , ఐరోపా దేశాలు ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరారు. జి 20 కూటమి దేశాలు తీవ్రంగా స్పందించినప్పుడే రష్యా తన మారణహోమాన్ని ఆపుతుందని టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News