- Advertisement -
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఒకవైపు శాంతి ఒప్పందానికి సన్నద్ధం అవుతుండగా, మరోవైపు పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కీవ్పై దాదాపు వందకు పైగాడ్రోన్లు, ఐదు క్షిపణులను రష్యా ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. వాటిలో 42 డ్రోన్లను తమ సైన్యం ధ్వంసం చేసిందని తెలిపింది. జపోరిజ్జియా ప్రాంతం లోని ఫ్రంట్లైన్ గ్రామం డోలింకాపై జరిగిన దాడిలో 9 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు జపోరిజ్జియా గవర్నర్ ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. పలువురు గాయపడ్డారు. దీంతో కీవ్ సైతం మాస్కోపై ప్రతీకార దాడులు చేసింది. రష్యా లోని పలుప్రాంతాలపై ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడుల్లో 14 మంది గాయపడ్డారని, పలు భవనాలు ధ్వంసమయ్యాయని రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- Advertisement -