Wednesday, June 18, 2025

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి: 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

రష్యా రాత్రిపూట ఉక్రెయిన్‌పై జరిపిన డ్రోన్లు, క్షిపణుల దాడిలో కనీసం 15 మంది చనిపోగా, 116 మందికి గాయాలయ్యాయి. మంగళవారం వారంతా తమ ఇళ్లలో, స్థానిక కార్యాలయాలలో నిద్రిస్తున్నప్పుడు బలయ్యారు. రాత్రి పూట గంటల తరబడి నగరం అంతటా పేలుళ్ల శబ్దాలు ప్రతిధ్వనించాయని, నగరంలో 14 మంది మరణించారని, 99 మంది గాయపడ్డారని కీవ్ నగర సైనిక పాలనాధిపతి తైమూర్ తకాచెంకో తెలిపారు. బాంబు దాడి తొమ్మిది అంతస్తుల నివాస భవనాన్ని కూల్చి వేయగా, డజన్ల కొద్దీ అపార్టుమెంట్లు ధ్వంసమయ్యాయి. అత్యవసర సిబ్బంది శిథిలాల నుండి ప్రజలను రక్షిస్తున్నారు. ‘ఈ దాడి కీవ్‌పై జరిగిన ఓ భయంకర దాడి’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు కావాలని కొనసాగిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాత్రి వేళ రష్యా 440 డ్రోన్లను, 32 క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించిందని కూడా ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News