రెండెకరాల లోపు ఉన్న 41.25లక్షల మంది
రైతుల ఖాతాల్లో జమ 39.16లక్షల
ఎకరాలకు రైతుభరోసా చెల్లింపులు ఎకరాల
వారీగా కాకుండా అందరికీ చెల్లింపు
భూవిస్తీర్ణంపై ఎలాంటి పరిమితి లేకుండా
అర్హులైన రైతులందరికీ భరోసా రైతునేస్తం
వేదికపై నుంచి మీటనొక్కి రైతుభరోసా
నిధులు విడుదల చేసిన సిఎం రేవంత్
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్ర స్తుత వానాకాలం రైతు భరోసా ని ధులు రైతు ఖాతాల్లోకి జమ చేయడం ప్రారంభమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో జరిగిన రైతు నేస్తం కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా ప్రారంభించారు.ఆన్ లైన్లో మీట నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో సిఎం నిధులు జమ చేశారు. 9 రో జుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా చెల్లిస్తామని సిఎం ప్రకటించారు.దీంతో కొద్ది గంటల్లోనే రెండు ఎకరాల వర కు సాగుఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి ఆరు వేల చొప్పున రై తు భరోసా నిధుల జమ చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. 41. 25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు గా ను రూ.2,349.83 కోట్ల రైతు భరో సా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. మిగిలిన వారికి ఎకరాలతో సంబంధం లేకుండా వచ్చే తొమ్మిది రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.