నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ మాయ చేశావే’(Ye Maya Cheshave). 2010లో విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా ఆ సినిమా చై, సామ్ మధ్య లవ్స్టోరీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో చై, సామ్ల మధ్య ఏర్పడిన స్నేహం తర్వాత ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్లిదరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా చైతన్య, హీరోయిన్ శోభితను వివాహం చేసుకోగా.. సమంత సినిమాలు, వెబ్సిరీస్లు చేస్తూనే.. నిర్మాతగా కూడా మారిపోయింది.
తాజాగా ఏ మాయ చేశావే (Ye Maya Cheshave) సినిమాను జూలై 18వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్లో చై, సామ్లు కలిసి పాల్గొంటున్నారని కొద్దిరోజులుగా సోషల్మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై సమంత క్లారిటీ ఇచ్చింది. తాను ప్రమోషన్స్లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ‘‘చిత్ర బృందంతో కలిసి నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు. నిజం చెప్పాలంటే ప్రమోషన్స్కు దూరంగా ఉంటున్నా. ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తున్నారో తెలియదు. ఆ సినిమాకు ఉన్న అభిమానులు నటీనటులు కలిసి ప్రమోట్ చేస్తేనే చూడాలనుకుని ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రేక్షకుల దృష్టి కోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదు’’ అని సమంత స్ఫష్టం చేసింది.