Wednesday, September 10, 2025

భారీ పోరాటాలతో కీలక షెడ్యూల్

- Advertisement -
- Advertisement -

మెగా సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ పాన్- ఇండియా మూవీ ‘సంబరాల ఏటిగట్టు’(ఎస్‌వైజి) కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లోకి ప్రవేశించింది. రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రై మ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని రూ.125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయి లో నిర్మిస్తున్నారు. ఇది సాయి దుర్గ తే జ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోం ది. సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమ య్యే అప్ కమింగ్ షెడ్యూల్‌లో పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేసిన అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది.

ప వర్ ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో సాయి దుర్గ తేజ్ తలపడతారు. గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సిజిఐ వర్క్ కూడా వే గంగా జరుగుతోంది. సాయి దుర్గ తేజ్ గత రెండు సంవత్సరాలుగా ‘సంబరా ల ఏటి గట్టు’ కోసం అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ పాత్రకు అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు.

Also Read: వీడని మత్తుతో యువత చిత్తు

ఎ స్‌వైజి సినిమాని మొదట దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నా, ఇండస్ట్రీ సమ్మె కారణంగా రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారు. ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఎస్‌వైజి ఒకటిగా నిలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘సంబరాల యేటి గట్టు’ పాన్- ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News